5న తెలంగాణకు గడ్కరీ రాక
NEWS May 03,2025 05:40 pm
కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈనెల 5న తెలంగాణలో పర్యటిస్తారు. రూ.5,416 కోట్లతో 26 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని వెల్లడించారు కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి. హైదరాబాద్ లోని అంబర్ పేటలో నిర్మించిన ఫ్లై ఓవర్ ను అదే రోజు ప్రారంభించనున్నారని స్పష్టం చేశారు. ఈ సందర్బంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.