దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన పహల్గామ్ ఉగ్రదాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విస్తృత స్థాయిలో సోదాలు జరిపింది. ఇందుకు సంబంధించి పూర్తి నివేదికను తయారు చేసింది. ఈ రిపోర్ట్ ను కేంద్రానికి మే 4వ తేదీన సమర్పించనుంది. ఇప్పటికే 90 ఓవర్ గ్రౌండ్ వర్కర్లపై కేసులు నమోదు చేసింది. మొత్తం 3 వేల మందిని ప్రశ్నించింది. 100కు పైగా ప్రాంతాల్లో తనిఖీలు జరిపింది. ఈ నివేదిక ఆధారంగా హోం శాఖ కీలక నిర్ణయం తీసుకోనుంది.