జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లా పహల్గామ్ లో పర్యాటకులను కాల్చి చంపిన ఉగ్రవాదుల కోసం భారత ఆర్మీ జల్లెడ పడుతోంది. దేశ వ్యాప్తంగా శోధాలు జరుపుతోంది. ఇదే సమయంలో దాడికి పాల్పడిన వారు చెన్నై నుంచి కొలొంబోకు వెళ్లినట్లు ఇంటెలిజెన్స్ దర్యాప్తులో వెల్లడైంది. దీంతో శ్రీలంక లోని కొలంబో ఎయిర్ పోర్ట్ లో భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. భారత్ ఇచ్చిన సమాచారంతో అక్కడి పోలీసులు కూంబింగ్ స్టార్ట్ చేశారు.