ఐపీఎల్ 2025 మెగా టోర్నీలో భాగంగా జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ప్లే ఆఫ్స్ బెర్త్ ను ఖరారు చేసుకుంది. చావో రేవో తేల్చుకోవాల్సిన సమయంలో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతులెత్తేసింది. 38 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది. టోర్నీ ఆరంభంలో దుమ్ము రేపిన ఎస్ఆర్ హెచ్ ఆ తర్వాత నిరాశ పరిచింది. ప్రసిద్ద కృష్ణ, సిరాజ్ చెరో రెండు వికెట్లు తీశారు. విజయంలో కీలక పాత్ర పోషించారు. దీంతో హైదరాబాద్ టోర్నీ నుంచి దాదాపు నిష్క్రమించినట్టే.