గోవా శిర్గావ్ లోని శ్రీదేవి ఆలయంలో శనివారం తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. 30 మందికి పైగా గాయపడ్డారు. హుటా హుటిన బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆలయంలో జాతర జరుగుతుండగా పెద్ద ఎత్తున గుమిగూడారు.