రహదారుల నిర్మాణానికి రూ. 5.10 కోట్లు విడుదల
NEWS May 03,2025 07:58 am
నిడదవోలు నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణానికి రూ. 5.10 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు మంత్రి కందుల దుర్గేష్. ఎర్రచెరువు - పి. వేమవరం, వడ్లూరు - తీపర్రు, తీతలి - మునిపల్లి రోడ్లకు మరమ్మత్తులు చేపడతామన్నారు. నియోజకవర్గ ప్రజల తరపున సీఎం, డిప్యూటీ సీఎం, ఆర్ అండ్ బి మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. రహదారుల మరమ్మతులకు నాబార్డు క్రింద నిధులు రిలీజ్ చేసినట్లు తెలిపారు.