విశాఖ రామానాయుడు స్టూడియో భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఫిల్మ్ సిటీ కోసం కేటాయించిన భూములను ఇతర అవసరాలకు వాడుకోవచ్చంటూ గత వైసీపీ సర్కార్ అనుమతి ఇచ్చింది. గత ప్రభుత్వ నిర్ణయాన్ని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని షోకాజ్ నోటీసు ఇచ్చింది ప్రస్తుత కూటమి సర్కార్. ఈ నోటీస్ ను సవాల్ చేస్తూ సురేష్ ప్రొడక్షన్స్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ పై జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది ధర్మాసనం. దీంతో దావాను ఉపసంహరించు కుంటున్నట్లు తెలిపింది సురేష్ ప్రొడక్షన్.