రాష్ట్రం బాగు పడటం మాజీ సీఎం జగన్ రెడ్డికి ఇష్టం లేదన్నారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఐదేళ్లు ఏపీ ప్రజలకు నరకం చూపించాడని అన్నారు. అందుకే తన పార్టీని 11 సీట్లకే పరిమితం చేశారన్నారు. అయినా బుద్ది రాలేదన్నారు. జగన్ అసెంబ్లీకి రాడు. ఇక అమరావతి 2.0కు ఎందుకు వస్తాడంటూ ఎద్దేవా చేశారు.