8న హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభం
NEWS May 02,2025 11:48 am
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. ఈనెల 8వ తేదీన హైడ్రా పోలీస్ స్టేషన్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని వెల్లడించారు. చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల కబ్జాలపై ఇకపై హైడ్రా PS లో కేసులు నమోదు చేస్తామన్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే సాధారణ పోలీస్ స్టేషన్ లలో నమోదైన భూకబ్జా కేసులపై కూడా ఫోకస్ పెడతామన్నారు. సాధారణ PS ల నుంచి హైడ్రా PS కు కేసులు బదిలీ అయ్యే ఛాన్స్ ఉందన్నారు.