భారత జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సంచలన ప్రకటన చేసింది. జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లా పహల్గామ్ ఘటనకు పాల్పడిన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రమూకలు ఇంకా ఇండియాలోనే ఉన్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఎన్ఐఏ ఇందుకు సంబంధించిన వివరాలు తెలిపింది. ఉగ్రదాడి అనంతరం దక్షిణ కాశ్మీర్లోని దట్టమైన అడవుల్లోకి వెళ్లి దాక్కున్నారని పేర్కొంది. ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ పరికరాలను వాడి ఉగ్రవాదులు తప్పించు కుంటున్నారని స్పష్టం చేసింది.