దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళిపై ప్రశంసలు కురిపించారు ప్రధాని మోడీ. ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్ 2025)ను ప్రారంభించారు. ఆ సందర్భంగా భారత దేశ సినీ రంగానికి చెందిన ప్రముఖ దర్శకులను కొనియాడారు. ఆస్కార్ అవార్డు పొందిన ఆర్ఆర్ఆర్ ను ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాజ్ కపూర్ , సత్య జిత్ రే వంటి దిగ్గజాలను గుర్తు చేశారు .