రామ రాజ్యం వ్యవస్థాపకుడు, చిల్కూరు పూజారిపై దాడి చేసిన ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వీర రాఘవ రెడ్డిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు 20 మందికి పైగా దాడి చేశారు. ఈ విషయం తానే స్వయంగా చెప్పారు. మోయినాబాద్ పోలీస్ స్టేషన్ లో సంతకం చేసేందుకు వెళ్లగా మాటు వేసి ఉన్న వారంతా తనపై విచక్షణా రహితంగా దాడి చేశారంటూ వాపోయారు. దాడి ఘటన కేసులో నిందితుడిగా ఉన్నారు. ఇటీవలే తనకు బెయిల్ మంజూరైంది.