పాకిస్తాన్ ఐఎస్ఐ తరపున గూఢచర్యం చేస్తున్న జైసల్మేర్ నివాసి పఠాన్ ఖాన్ ను అరెస్ట్ చేశారు రాజస్థాన్ ఇంటెలిజెన్స్. ఖాన్పై అధికారిక రహస్యాల చట్టం 1923 కింద కేసు నమోదు చేశారు. నెల రోజుల కిందట తనను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్బంగా ప్రశ్నిస్తున్నారు. ఖాన్ ను అధికారికంగా మే 1 న అరెస్ట్ చేసినట్లు తెలిపింది. తను 2013లో పాకిస్తాన్ ను సందర్శించాడు. అక్కడ పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ తో సంబంధం పెట్టుకున్నాడని పేర్కొంది. డబ్బులకు ఆశపడి గూఢచర్యంలో శిక్షణ పొందాడని వెల్లడించింది.