ఈరోజు అమరావతి రాజధాని లో గల వెలగపూడిలో జరుగుతున్న అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మోడీ వస్తున్న సందర్భంగా ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ పచ్చ తోరణాలతో నూతన శోభను సంతరించుకుంది. కూటమి పార్టీల జెండాలతో ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ మొత్తం ముస్తాబు చేస్తున్నారు. ఏర్పాట్లను టీడీపీ సీనియర్ నాయకులు చనుమోలు నారాయణరావు, స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులతో కలిసి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.