తమ సామాజిక వర్గాన్ని కించ పరిచేలా మాట్లాడాడంటూ హీరో విజయ్ దేవరకొండపై హైదరాబాద్ లోని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు న్యాయవాది కిషన్ లాల్ చౌహాన్. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య , పూజా హెగ్డే నటించిన రెట్రో మూవీ ఈవెంట్ సందర్బంగా రౌడీ ఆదివాసీలను అవమానించేలా మాట్లాడారంటూ ఆరోపించారు. ఆయనపై కేసు నమోదు చేయాలని కోరారు.