సీఎం రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. మాజీ సీఎం కేసీఆర్ చేసిన అప్పులు కట్టేందుకే లక్షా 2 వేల కోట్లు అప్పు తీసుకు రావడం జరిగిందన్నారు. తాను చేసిన అప్పులకు వడ్డీలు కట్టేందుకే తీసుకొచ్చిన అప్పులు సరి పోతున్నాయంటూ వాపోయారు. ఖజానా అంతా లూఠీ చేసినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఏ పథకాన్ని ఆపకుండా కొనసాగిస్తున్నామన్నారు. పేద ప్రజలకు సన్న బియ్యం ఇస్తున్నాం. కొలువు తీరాక 58 వేల జాబ్స్ ఇచ్చామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వలేదన్నారు సీఎం.