మన రాష్ట్రంలో ఎక్కువగా అసంఘటిత కార్మికులు ఉన్నారని వారిని ఆదుకుంటామన్నారు సీఎం చంద్రబాబు. ఇందులో వ్యవసాయంపై ఆధారపడిన వారే అధికంగా ఉన్నారని చెప్పారు. వ్యవసాయ కూలీలు లేకపోతే సాగు చేసే పరిస్థితి లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనులను కల్పిస్తోందన్నారు. మండుటెండల్లో కూడా భవన నిర్మాణ కార్మికులు పని చేస్తుండటం చూశానని తెలిపారు.