పహల్గామ్ దాడి ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. ఈ సందర్బంగా పిటిషనర్ పై సీరియస్ అయ్యింది. దావా దాఖలు చేసే ముందు బాధ్యతతో వ్యవహరించాలని స్పష్టం చేసింది. దేశంపై బాధ్యత లేదా అంటూ పిటిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. బలగాల మనోస్థైర్యాన్ని దెబ్బ తీస్తారాంటూ ఫైర్ అయ్యింది.