మెట్ పల్లి పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ పెట్రోలింగ్లో గాజులపేటకు చెందిన పురుషోత్తం వివేక్ వద్ద గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. ఆ వ్యక్తిని పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. యువత గంజాయి బారినపడి జీవితాన్ని పాడు చేసుకోవద్దన్నారు.