LOC వద్ద మరోసారి పాక్ కాల్పులు
NEWS May 01,2025 08:03 am
భారత, పాకిస్తాన్ సరిహద్దుల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. వరుసగా ఏడవ రోజు కాల్పులకు పాల్పడింది పాక్. లైన్ ఆఫ్ కంట్రోల్ లోని కుప్వారా, ఉరి, అఖ్నూర్ సెక్టార్లలో మన సైనికులే లక్ష్యంగా ఫైరింగ్ చేశారు. నిన్న రాత్రి కూడా కాల్పులకు తెగబడింది పాక్ ఆర్మీ. పాక్ కాల్పులను సమర్థంగా తిప్పి కొట్టింది భారత ఆర్మీ.