యాక్సిడెంట్ కేసులో నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష
NEWS Apr 30,2025 08:28 pm
మెట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 2022లో మద్యం సేవించి అజాగ్రత్తగా వాహనం నడిపి ఒకరి మరణానికి కారణమైన కేసులో డ్రైవర్ షేక్ ఇసాక్కు 10 సంవత్సరం జైలు శిక్ష, రూ.20,500 జరిమానాను అడిషనల్ సెషన్స్ జడ్జి నారాయణ విధించారు. పోలీసులు సాక్షులను ప్రవేశపెట్టగా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ K. మల్లేశం తమ వాదనలు వినిపించారు. సాక్షులను విచారించిన న్యాయమూర్తి శిక్ష ఖరారు చేశారు.