భూదాన్ భూముల కేసులో ఐపీఎస్ లకు షాక్
NEWS Apr 30,2025 05:20 pm
భూదాన్ భూముల కేసులో సంచలన తీర్పు వెలువరించింది హైకోర్టు. ఇప్పటికే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ భూములను నిషేధిత జాబితాలో ఉంచాలని తీర్పు ఇచ్చింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను నిలిపి వేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఐపీఎస్ లు రవి గుప్తా, మహేష్ భగవత్, శిఖా గోయల్, సౌమ్యా మిశ్రా, తరుణ్ జోషి, రాహుల్ హెగ్డే.