సింహాచలం ఆలయంలో గోడ కూలిన ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు పీఎం నరేంద్ర మోదీ. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని మోదీ ఆకాంక్షించారు. పీఎం సహాయనిధి నుంచి ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం అందజేస్తామన్నారు పీఎం.