చంద్రబాబు పాలన బక్వాస్
NEWS Apr 30,2025 05:32 am
చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు మాజీ సీఎం వైఎస్ జగన్. విద్య, వైద్యం, వ్యవసాయం ఇలా అన్ని రంగాల్లోనూ విధ్వంసమే కొనసాగుతోందన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో అమలవుతోందన్నారు. వీటిని ప్రజల్లోకి బాగా తీసుకువెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు. జిల్లాలో పార్టీ ఓనర్షిప్ మీదేనని అన్నారు. ప్రజా సంబంధిత అంశాల్లో ఒకరి ఆదేశాల కోసం ఎదురు చూడొద్దని స్పష్టం చేశారు. వైసీపీ జిల్లా అధ్యక్షుల సమావేశంలో దిశా నిర్దేశం చేశారు.