ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతాం
NEWS Apr 30,2025 05:22 am
దేశ ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదం లేకుండా చేస్తామన్నారు. భారత్ సైన్యంపై పూర్తి నమ్మకం ఉందన్నారు. పహల్గాం దాడికి ధీటైన సమాధానం ఇస్తామన్నారు. సైన్యమే స్థలం, టైమ్ చూసి జవాబిస్తుందని చెప్పారు. త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామన్నారు. హై లెవల్ మీటింగ్ లో భారత్, పాకిస్తాన్ మధ్య చోటు చేసుకున్న పరిస్థితులపై చర్చించారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అజిత్ దోవల్, CDS అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు.