కాళేశ్వరానికో న్యాయం..పోలవరానికో న్యాయమా..?
NEWS Apr 29,2025 06:50 pm
NDSA ఆధ్వర్యంలో కడుతున్న పోలవరం ప్రాజెక్టు కుప్పకూలి పోయిందని, అక్కడికి ఎందుకు వెళ్లడం లేదంటూ నిప్పులు చెరిగారు మాజీ మంత్రి హరీశ్ రావు. దేశంలోని చట్టం అన్ని రాష్ట్రాలకు, డ్యాంలకు, ప్రాజెక్టులకు ఒకేలా ఉండాలన్నారు. కేంద్రం జేబు సంస్థగా ఎన్డీఎస్ఏ మారి పోయిందన్నారు. ఈ దేశంలో ED, CBI లను ఎలా వాడుతున్నారో నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (NDSA) ను కూడా అదే పద్ధతిలో వాడుతున్నారంటూ ధ్వజమెత్తారు.