మే2న ప్రధాని మోదీ ఏపీలో పర్యటించనున్నారు. అమరావతి రాజధాని పునర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్బంగా ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి వంగలపూడి అనిత. భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. పీఎం రాక కోసం ఏపీ ప్రజలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారని అన్నారు. అమరావతి నిర్మాణం కోట్లాది జనం కల.. కానీ ఐదేళ్ల క్రితం విధ్వంస పాలన మొదలైందంటూ మండిపడ్డారు. ప్రజా వేదిక కూల్చడంతోనే అమరావతి విధ్వంసానికి బీజం పడిందన్నారు. ముఖ్యమంత్రులు ఎవరైనా గత పాలకులు చేపట్టిన అభివృద్ధి పనులను కొనసాగించారని తెలిపారు.