ఎంఎస్ఎంఈలకు బ్యాంకులు అండగా నిలవాలి
NEWS Apr 29,2025 05:53 pm
వచ్చే నాలుగేళ్లలో ఏపీ అభివృద్ధి, సంపద సృష్టి, పేదరిక నిర్మూలన లక్ష్యంగా పెద్దఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నామని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. ఓవైపు స్వర్ణాంధ్ర-2047 విజన్కు అనుగుణంగా పనిచేస్తూనే, మరోవైపు 2029 కల్లా పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు, లక్ష్యాలపై ప్రధానంగా దృష్టి పెట్టామని స్పష్టం చేశారు. దీనికి బ్యాంకులు సంపూర్ణ మద్దతివ్వాలని సూచించారు. 2025-26లో నిర్దేశించుకున్న క్రెడిట్ ప్లాన్ లక్ష్యాలను అధిగమించేలా కృషి చేయాలన్నారు. సచివాలయంలో జరిగిన 231వ స్టేట్ లెవెల్ బ్యాంకర్ల కమిటీ సమావేశంలో పాల్గొన్నారు.