పెహల్గామ్ దాడి ఘటనలో మతం అడిగి ఉగ్రవాదులకు కాల్పులకు పాల్పడ్డాడని బాధితులు చెబుతుంటే సెక్యులర్ వాదులు అదేమీ కాదంటూ చెప్పడం దారుణమన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కొందరు భారత్ లో ఉంటూ పాకిస్తాన్ ను ప్రేమిస్తున్నారంటూ ఆరోపించారు. ఆ దేశంపై అంత ప్రేమ గనుక ఉంటే భారత దేశం నుంచి వెంటనే వెళ్లి పోవాలని అన్నారు. ఇవాళ దేశమంతా ఒకే తాటిపై ప్రధాని మోదీకి మద్దతు తెలపాల్సిన అవసరం ఉందన్నారు.