గ్రూప్ -1లో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ , తమకు న్యాయం చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పిటిషనర్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది తెలంగాణ హైకోర్టు. తప్పుడు ప్రమాణ పత్రాలతో కోర్టును తప్పుదోవ పట్టించారని జస్టిస్ నగేశ్ భీమపాక మండిపడ్డారు. ఈ మేరకు పిటిషనర్లకు రూ.20 వేల జరిమానా విధించారు. పిటిషనర్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.