సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన అమరావతి రైతులకు కోలుకోలేని షాక్ ఇచ్చారు. రాజధాని అభివృద్దికి రెండో విడత భూసేకరణ తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తేనే అమరావతి అంతర్జాతీయ నగరంగా ఎదుగుతుందని.. లేకపోతే మున్సిపాలిటీగా మిగిలి పోతుందన్నారు. సీఎం చేసిన ప్రతిపాదనకు రైతులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అమరావతిని ఏకైక రాజధానిగా పార్లమెంట్లో చట్టం చేయాలని కోరారు. రైతులు చేసిన ప్రతిపాదనకు సీఎం ఒప్పుకున్నారు.