కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకు వచ్చిన సన్న బియ్యం పథకం పేదల కడుపు నింపుతోందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సన్నాలకు రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేశామన్నారు. జనాభాలో 85 శాతం ఉచితంగా 6 కిలోలు సన్న బియ్యం అందిస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన దొడ్డు బియ్యం ప్రజలు ఎవరూ తినడం లేదన్నారు. సంక్షేమం, అభివృద్దితో ముందుకు వెళుతున్నామన్నారు.