అశ్లీల కంటెంట్ పై కేంద్రానికి నోటీస్
NEWS Apr 28,2025 05:56 pm
ఓటీటీ, సోషల్ మీడియాలో అశ్లీల కంటెంట్పై స్పందించాలని కేంద్ర సర్కార్ కు స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. పలు ఓటీటీ ప్లాట్ఫామ్లు, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అశ్లీల కంటెంట్ ఎక్కువగా ప్రసారం అవుతోందని , వాటిని కట్టడి చేయాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై స్పందన తెలియ జేయాలంటూ కేంద్రం, ఇతరులకు నోటీసులు పంపించింది సుప్రీం కోర్టు.