సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ సస్పెన్షన్ పొడిగింపు
NEWS Apr 28,2025 05:51 pm
ఏపీ సీఐడీ మాజీ చీప్ సునీల్ కుమార్ కు షాక్ తగిలింది. తనపై విధించిన సస్పెన్షన్ ను మరో 4 నెలల పాటు పొడిగించింది ఏపీ సర్కార్. ఆగస్టు 28 వరకూ సస్పెన్షన్ పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. రివ్యూ కమిటీ సిపార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అఖిల భారత సర్వీసు నిబంధనల ఉల్లంఘన అభియోగంపై సస్సెన్షన్ వేటు వేసింది. అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లారని ఆరోపించింది. దీనిపై స్పందించిన సునీల్ కుమార్ ప్రభుత్వం తన పట్ల కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని వాపోయారు.