మాజీ మంత్రి జానారెడ్డితో సీఎం రేవంత్ భేటీ
NEWS Apr 28,2025 12:00 pm
మాజీ మంత్రి కందూరు జానారెడ్డితో తన నివాసంలో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సమావేశానికి కేశవరావు, వేం నరేందర్ రెడ్డి హాజరయ్యారు. అరగంటకు పైగా కొనసాగింది. మావోయిస్టుల కాల్పుల విరమణ, శాంతి చర్చల విజ్ఞప్తి నేపథ్యంలో నిన్న సీఎంను కలిశారు పౌర సమాజం కమిటీ. ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. ఈనెల 22న హరగోపాల్ నేతృత్వంలోని కమిటీ సీఎంకు లేఖ రాసింది.