సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.1.50 కోట్లు కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కింద విరాళంగా అందించింది. ఈ మేరకు తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి ఆ సంస్థ జోనల్ హెడ్ కె.ధారాసింగ్ నాయక్, రీజనల్ హెడ్ ఈ.వెంకటేశ్వర్లు విరాళం చెక్కును అందజేశారు