హైదరాబాద్ లో 200 మందికి పైగా పాకిస్తానీలు
NEWS Apr 27,2025 07:02 pm
కేంద్రం జూలు విదల్చడంతో హైదరాబాద్ లో పాకిస్తానీల జాడను గుర్తించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. పాతబస్తీలో 200 మందికి పైగా పాక్ పౌరులు ఉన్నట్లు తేలింది. 156 మంది లాంగ్ టర్మ్ , 13 మంది షార్ట్ టర్మ్ , 39 మంది బిజినెస్ వీసాలతో నగరంలో ఉంటున్నట్లు గుర్తించారు. పాకిస్తానీయులంతా 2 రోజుల్లో వెళ్లి పోవాల్సిందేనంటూ ఆదేశించింది. పాకిస్తాన్ నుంచి వచ్చిన వారిని పట్టుకునేందుకు పాతబస్తీని జల్లెడ పడుతున్నారు. బహదూర్ పుర, చాంద్రాయణగుట్ట, మదీనగూడ, పాతబస్తీ, చార్మినార్ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు.