శాంతి కోసం ఏకతాటిపై నిలుద్దాం: మల్లేశ్
NEWS Apr 27,2025 05:57 pm
పల్గామ్ ఉగ్రదాడి పట్ల సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (సాటా) తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేసింది. అమాయకుల ప్రాణనష్టం పట్ల సాటా అధ్యక్షుడు మల్లేశ్ హృదయపూర్వక సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబాలకు శాంతి, ధైర్యం కలగాలని ప్రార్థించారు. మత, కుల, ప్రాంత భేదాలు మరిచి తీవ్రవాదాన్ని ఖండిద్దాం, ప్రపంచ శాంతి కోసం ఏకతాటిపై నిలుద్దామని పిలుపునిచ్చారు.