సింహాచలం చందనోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు
NEWS Apr 27,2025 04:48 pm
సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు హోం మంత్రి వంగలపూడి అనిత. ఆలయ మర్యాదలతో హోం మంత్రికి ఘన స్వాగతం పలికిన ఆలయ కమిటీ చైర్మన్, ఈవో, అర్చకులు. కప్ప స్తంభం ఆలింగనం , స్వామి వారి దర్శనం అనంతరం వేద ఆశీర్వచనం చేశారు పండితులు. స్వామి వారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు. చందనోత్సవం నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయ అధికారులకు పలు సూచనలు చేశారు. చందనోత్సవం నేపథ్యంలో సామాన్య భక్తుల దర్శనాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.