ఓరుగల్లులో బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరగనుంది. ఈ సందర్బంగా కేటీఆర్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ లోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రవణ్ కుమార్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ , ఎమ్సెల్సీ సిరికొండ మధుసూదనాచారి పాల్గొన్నారు.