తాండ్రియాల గ్రామంలో దొంగల బీభత్సం
NEWS Apr 27,2025 05:51 pm
తాండ్రియాల గ్రామ ఆలయాల్లో దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామంలోని దుర్గమ్మ, ఎల్లమ్మ ఆలయాల్లోని హుండీలను ఎత్తుకెళ్లారు.ఎల్లమ్మ గుడిలోని హుండీలో డబ్బులు లేకపోవడంతో ఆ హుండీని చెట్లపొదల్లో పారేశారు. దేవాలయాలకు సమీపంలో ఉన్న తునికి నర్సయ్య, అల్లకొండ నర్సయ్యలకు సంబంధించిన 2 షాపుల నుంచి 2 సిలిండర్లతో పాటు ఇతర వస్తువులు దొంగిలించారని ఎస్సై నవీన్ తెలిపారు. పోలీసులు విచారణ చేస్తున్నారు.