మే 9న చెర్రీ మైనపు విగ్రహం ఆవిష్కరణ
NEWS Apr 27,2025 08:33 am
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు అరుదైన గౌరవం దక్కింది. లండన్ మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో హీరో మైనపు విగ్రహం ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి గతంలోనే ప్రకటన రిలీజ్ చేశారు. ఈ మేరకు ఇందుకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. వచ్చే మే 9వ తేదీన దీనిని లాంఛ్ చేయనున్నారు. ఆ మైనపు విగ్రహాన్ని సింగపూర్ టుస్సాడ్స్ మ్యూజియానికి తరలించనున్నారు. ఇప్పటికే ఇదే మ్యూజియంలో ప్రిన్స్ మహేష్ బాబు, పాన్ ఇండియా హీరోలు అల్లు అర్జున్, ప్రభాస్ మైనపు విగ్రహాలు ఉన్నాయి.