ఈడీ విచారణకు మహేష్ బాబు హాజరవుతారా..?
NEWS Apr 27,2025 08:27 am
సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీల వ్యవహారంలో మనీ లాండరింగ్ చోటు చేసుకుందని ఆరోపిస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థ ప్రముఖ నటుడు మహేష్ బాబుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇవాళ హాజరు కావాలని స్పష్టం చేసింది. సాయిసూర్య డెవలపర్స్ కంపెనీ నుంచి మహేశ్కు రూ.5.9 కోట్లు చెల్లించినట్లు గుర్తించింది. చెక్కుల రూపంలో రూ.3.4 కోట్లు, నగదు రూపంలో రూ.2.5 కోట్లు చెల్లించినట్లు తేలింది. కాగా ఈడీ విచారణకు తను హాజరవుతారా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.