న్యాయ విజ్ఞానం అందించేందుకే సదస్సులు
NEWS Apr 26,2025 06:51 pm
సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయ విజ్ఞానం అందించేందుకే సదస్సులు నిర్వహిస్తున్నామని మెట్పల్లి సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వరరావు అన్నారు. మండల్ లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో మెట్పల్లిలో నిర్వహించిన న్యాయవిజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు. ఇంటర్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించారు. బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మోహన్ రెడ్డి, శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు రాజశేఖర్ తదితరులున్నారు.