మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కూన గోవర్దన్ మామిడి కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఇందులో భాగంగా వ్యాపారులకు మార్కెట్ ద్వారా అధిక ఆదాయం లభించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులకు రశీదులు ఇవ్వాలని ఆదేశించారు. కార్యదర్శి ఇంద్రసేన రెడ్డి, ఆపరేటర్ సతీశ్ కుమార్ చైర్మన్ తో ఉన్నారు.