ఇప్పుడంతా మోడ్రన్ రాజకీయమే
NEWS Apr 26,2025 05:29 pm
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో జరిగిన భారత్ సమ్మిట్ లో పాల్గొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్య రాజకీయాలు మారిపోయాయని ఆవేదన చెందారు. పదేళ్ల క్రితం నాటి పరిస్థితులు ఇప్పుడు లేవన్నారు. మోడ్రన్ సోషల్ మీడియాతో అంతా మారి పోయిందన్నారు. ఇప్పుడంతా మోడ్రన్ రాజకీయం రాజ్యమేలుతోందన్నారు. ప్రతిపక్షాలను అణచివేసే కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. నిన్ననే సమ్మిట్ కు రావల్సి ఉందని, కానీ కాశ్మీర్ వెళ్లి పహల్గామ్ ఉగ్రదాడిలో గాయపడిన బాధితులను పరామర్శించానని, అందుకే రాలేక పోయానని చెప్పారు.