భారత్ సమ్మిట్ కాదు కాంగ్రెస్ సమ్మిట్
NEWS Apr 26,2025 04:43 pm
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ నిప్పులు చెరిగారు. హైదరాబాద్ లో నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్ పై భగ్గుమన్నారు. ఇది భారత్ సమ్మిట్ కాదని కాంగ్రెస్ పార్టీ సమ్మిట్ అంటూ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి రూ.100 కోట్లు పెట్టి భారత్ సమ్మిట్ సదస్సు నిర్వహిస్తే ఒక్క ప్రపంచ నాయకుడు రాలేదన్నారు. ఒక్క ప్రెసిడెంట్, ఒక్క ప్రైమ్ మినిస్టర్, ఒక్క గ్లోబల్ సెలబ్రెటీ, 3000 మంది బిలియనీర్లు ఎవ్వరూ రాలేదన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని, దేశాన్ని సర్వనాశనం చేసిన సమ్మిట్ ఇది అంటూ ఫైర్ అయ్యారు పాల్.