కష్టపడి చదివితే ఏదీ అసాధ్యం కాదని నిరూపించాడు కర్ణాటక రాష్ట్రంలోని బెల్గావి జిల్లాకు చెందిన బీరప్ప. తాజాగా జరిగిన యూపీఎస్సీ ప్రకటించిన సివిల్స్ ఫలితాలలో దేశ వ్యాప్తంగా ప్రకటించిన ఫలితాలలో తను 551వ ర్యాంకు సాధించాడు. తను ఐఏఎస్ సర్వీస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. తన తండ్రి గొర్రెల కాపరి కావడం విశేషం. ఇంజనీరింగ్ చదివి సివిల్స్ కొట్టిన తనను సీఎంతో పాటు పలువురు అభినందిస్తున్నారు.