పహల్గామ్ ఘటన దారుణం - ట్రంప్
NEWS Apr 26,2025 09:29 am
యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డడ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా గర్హనీయమని పేర్కొన్నారు. మృతులపై కాల్పులకు దిగడం పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఈ ఘటన జరగడం బాధాకరమని, తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. భారత్, పాక్ మధ్య కశ్మీర్ విషయంలో చాలా ఏళ్లుగా గొడవ జరుగుతోందని అన్నారు. అయితే, దాన్ని ఆ రెండు దేశాలే పరిష్కరించు కుంటాయని స్పష్టం చేశారు డొనాల్డ్ ట్రంప్.