ఉగ్ర దాడులను నిరసిస్తూ సుల్తానాబాద్ లో బంద్
NEWS Apr 26,2025 01:09 pm
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణాన్ని ఇవాళ స్వచ్ఛంద బందుకు భాజపా శ్రేణులు పిలుపునిచ్చారు. దీంతో సుల్తానాబాద్ లో వ్యాపార , వాణిజ్య సముదాయాలు తెరుచుకోలేదు. ఉదయం నుంచి దుకాణ సముదాయాలతో పాటు హోటల్లు, కూరగాయల మార్కెట్, పండ్ల దుకాణాల నిర్వాహకులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ప్రజలు కూడా బయటకు రాకపోవడంతో రహదారులు, ప్రధాన కూడళ్ళు బోసిపోయాయి. భాజాపా శ్రేణులు ఉదయం నుంచి మార్కెట్లో తిరుగుతూ దుకాణాలను బందు చేయించారు. అనంతరం ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేసి నిరసన వ్యక్తం చేశారు.